వైసీపీ, బీజేపీలు రాహుకేతువులు: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-10-11T00:56:22+05:30 IST

రాష్ట్రానికి బీజేపీ, వైసీపీలు శనిగ్రహాల్లా, రాహుకేతువుల్లా దాపురించాయని, బద్వేలు ఉప ఎన్నికలో ఈ రెండు పార్టీలను ఓడించి

వైసీపీ, బీజేపీలు రాహుకేతువులు: తులసిరెడ్డి

కడప: రాష్ట్రానికి బీజేపీ, వైసీపీలు శనిగ్రహాల్లా, రాహుకేతువుల్లా దాపురించాయని, బద్వేలు ఉప ఎన్నికలో ఈ రెండు పార్టీలను ఓడించి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు కరోనాతో పనులు లేక ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వంట గ్యాస్‌, డీజల్‌, పెట్రోల్‌, ఎరువుల ధరలు పెంచడం అమానుషమన్నారు. జగన్‌ రెండున్నర సంవత్సరాల పాలన రాష్ట్రానికి ఒక పీడకల అన్నారు. అధికారంలోకి వస్తూనే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేశారని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ పథకం కింద రూ.8 వేల కోట్లు ఎగ్గొట్టి రైతుల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే వైసీపీ, బీజేపీలకు డిపాజిట్‌ కూడా దక్కదని తులసిరెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-11T00:56:22+05:30 IST