వైసీపీ వైఖరి సరికాదు

ABN , First Publish Date - 2022-08-12T03:33:28+05:30 IST

గోరంట్ల మాధవ్‌ వ్యవహారంలో వైసీపీ వైఖరి సరికాదని, వెంటనే అతడిని సస్పెండ్‌ చేయాలని టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు ధ్వజమెత్తారు.

వైసీపీ వైఖరి సరికాదు

గోరంట్ల మాధవ్‌ను సస్పెండ్‌ చేయాలి

తెలుగు మహిళలు, టీడీపీ నాయకుల డిమాండ్‌ 

కనిగిరి, ఆగస్టు 11 : గోరంట్ల మాధవ్‌ వ్యవహారంలో వైసీపీ వైఖరి సరికాదని, వెంటనే అతడిని సస్పెండ్‌ చేయాలని టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు, లోకేష్‌ను గోరంట్ల మాధవ్‌ అనుచితంగా తూలనాడిన వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు.  ఈ సందర్భంగా ఐ టీడీపీ రాష్ట్ర నాయకులు జంషీర్‌ అహ్మ ద్‌ మాట్లాడుతూ మాధవ్‌  వీడియోను చూసని  ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. తెలుగు మహిళలు కరణం అరుణ, జగదాబి రమణమ్మ మాట్లాడుతూ జగన్‌ పాలనలో దుర్యోధనుడిలా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు తయార య్యారన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని ఆం దోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పామూరు తెలుగు మహిళలు సుభాషిణి, ము స్లిం మైనారీటీ నాయకులు రోషన్‌సంఽధాని, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, నగరపంచాయతీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి, చీకటి వెంకటసుబ్బయ్య, తులసి, పార్వతి, నారాయణమ్మ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-12T03:33:28+05:30 IST