వైసీపీ వారే నా సోదరుడిపై దాడి చేశారు: జడ్జి రామకృష్ణ

ABN , First Publish Date - 2020-09-28T01:28:11+05:30 IST

వైసీపీ వారే నా సోదరుడిపై దాడి చేశారని జడ్జి రామకృష్ణ తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేస్తాననే దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

వైసీపీ వారే నా సోదరుడిపై దాడి చేశారు: జడ్జి రామకృష్ణ

అమరావతి: వైసీపీ వారే నా సోదరుడిపై దాడి చేశారని జడ్జి రామకృష్ణ తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేస్తాననే దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. విజయవాడలో దళిత మేధావులు ఏకమయ్యారని, దానికి ప్రతిగానే ఈ దాడి చేశారని ఆరోపించారు. దాడి జరిగిన చోట సీసీ పుటేజీ పరిశీలించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ అండతోనే దాడులు జరుగుతున్నాయని జడ్జి రామకృష్ణ పేర్కొన్నారు.


జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై వైసీపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బి.కొత్తకోట మెయిన్‌రోడ్‌లో సరుకులు తీసుకుంటున్న రామచంద్రపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన కారులో వచ్చి ఐదుగురు గూండాలు తెగబడ్డారు. అనంతరం వారందరూ పరారయ్యారు.  తీవ్రంగా గాయపడిన రామచంద్రను  బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైసీపీ నాయకులతో కలిసి దుండగులు ఈ దాడికి  ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-09-28T01:28:11+05:30 IST