వైసీపీ అరాచకాలకు నూకలు చెల్లు!

ABN , First Publish Date - 2022-05-24T04:54:03+05:30 IST

వైసీపీ అరాచక పాలనకు ఇక నూకలు చెల్లాయని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు.

వైసీపీ అరాచకాలకు నూకలు చెల్లు!
సమావేశంలో మాట్లాడుతున్న రమే్‌షకుమార్‌రెడ్డి

లక్కిరెడ్డిపల్లె, మే 23: వైసీపీ అరాచక పాలనకు ఇక నూకలు చెల్లాయని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రమే్‌షకుమార్‌రెడ్డి ఇంట్లో రాయచోటి క్లస్టర్స్‌ కమిటీ మహానాడు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాయచోటి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 నుంచి 25 వేల మంది వరకు ఒక క్లస్టర్‌గా తయారు చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలనాన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ మూడేళ్ల పాలనలో నిత్యావసర ధరల పెంపు, విద్యుత్‌ బిల్లులు, చెత్తకు పన్ను, మహిళలపై అత్యాచారాలు, అక్రమాలు, దోపిడీలు శృతిమించిపోయాయని, ప్రజలు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై విసిగిపోయారన్నారు.  వైసీపీ అరాచకాలను ప్రతి ఇంటికివెళ్లి వివరించాలన్నారు. అనంతరం రమే్‌షకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ మూడేళ్లుగా శిలాఫలకాలకే పరిమితమైందన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి అన్నమయ్య జిల్లా పరిశీలకుడు గోపీనాధ్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నరసారెడ్డి, రాష్ట్ర బీసీ సెల్‌ అధ్యక్షుడు జయరాం, మాజీ ఎంపీపీ ఉమాపతిరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ  చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, బీసీ సెల్‌ అధ్యక్షులు బడుగు వాసు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T04:54:03+05:30 IST