కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం
ABN , First Publish Date - 2021-10-27T05:18:15+05:30 IST
వైసీపీ 38వ డివిజన్ అధ్యక్షుడుగా పనిచేసి ఇటీవల కరోనాతో మృతి చెందిన కోబాల్డ్పేటకు చెందిన కార్యంశెట్టి సులోచనరావు కుటుంబాన్ని మంగళవారం ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పరామర్శించారు.
గుంటూరు, అక్టోబరు 26: వైసీపీ 38వ డివిజన్ అధ్యక్షుడుగా పనిచేసి ఇటీవల కరోనాతో మృతి చెందిన కోబాల్డ్పేటకు చెందిన కార్యంశెట్టి సులోచనరావు కుటుంబాన్ని మంగళవారం ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పరామర్శించారు. అప్పిరెడ్డితో పాటు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, నగర మేయర్ కావటి మనోహర్నాయుడు, జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, మార్కెట్యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, డీసీసీబీ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్, డిప్యూటీ మేయర్ షేక్ సజీల ఇతర నాయకులు సులోచనారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్థానిక కార్పొరేటర్ బూసి రాజలత, జబీరాబేగం, గనిక ఝాన్సీ, షౌకత, బందా రవీంద్రనాధ్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, అంగడి శ్రీనివాసరావు, జగన్ కోటి పలువురు నాయకులున్నారు.