అనంతపురంజిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ

ABN , First Publish Date - 2020-04-03T20:54:36+05:30 IST

వైసీపల్లిలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ కలకలం రేపుతోంది.

అనంతపురంజిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ

అనంతపురం జిల్లా: వైసీపల్లిలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ కలకలం రేపుతోంది. గత రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఉన్న మాసప్పస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఒక తాగునీటి పైప్ లైన్‌కు రెండు టాప్‌లు, సిమ్మెంట్ రోడ్లు వేయాలని ఒక వర్గం.. మరో వర్గం వేయకూడదని పోటీపడ్డాయి. ఇదే ఘర్షణకు కారణమైంది. వైసీపీ కార్యకర్త సురేష్.. అతని అనుచరులు, టీడీపీ కార్యకర్త కోడి బసప్ప.. అతని అనుచరులు 17 మంది వరకు ఒకరిపై ఒకరు కర్రాలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడినవారిని కల్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 9 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated Date - 2020-04-03T20:54:36+05:30 IST