కురుబలపై వైసీపీ అరాచకాలు ఆపాలి

ABN , First Publish Date - 2021-04-13T05:41:19+05:30 IST

జిల్లాలో కురుబలపై వైసీపీ సాగిస్తున్న అరాచకాలు, దాడులను వెంట నే ఆపాలని కురుబ యువజన సం ఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ హెచ్చరించారు.

కురుబలపై వైసీపీ అరాచకాలు ఆపాలి
మాట్లాడుతున్న కురుబ యువజన సంఘం నాయకుడు రాజశేఖర్‌

కురుబ యువజన సంఘం నాయకుల హెచ్చరిక

అనంతపురం వైద్యం, ఏప్రిల్‌12: జిల్లాలో కురుబలపై వైసీపీ సాగిస్తున్న అరాచకాలు, దాడులను వెంట నే ఆపాలని కురుబ యువజన సం ఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ హెచ్చరించారు. స్థానిక జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక కురుబలపై అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ఆత్మకూరు మండలం బీ యాలేరులో ఓ కురుబ మహిళ జుట్టు కత్తిరించారన్నారు. వడియంపేటలో కురుబలు బయట కూర్చోరాదనీ, వారి గుడ్డలు కూడా రజకులు ఉతకకూడదని ఆంక్షలు పెట్టారన్నారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో ఓ కురుబ కులస్తుడికి చెందిన ఇల్లు కట్టకుండా బండలు నాటారన్నారు. అదే మండలంలో కురుబలకు చెందిన భూ వివాదంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తనయుడు జోక్యం చేసుకుని, మానసికంగా వేధిస్తున్నారన్నారు. ఇటీవల న్యాయవాది బిల్లే నరేంద్రపై ధర్మవరంలో వైసీపీ గూండాలు దాడి చేశారన్నారు. ఇలా జిల్లాలో వరుసగా కురుబలపై దాడులు, అరాచకాలకు వైసీపీ పాల్పడుతోందన్నారు. వీటిపై కురుబ సంఘం ఉద్యమ పంథాలో నిరసనలకు దిగుతుందని హెచ్చరించారు.

Updated Date - 2021-04-13T05:41:19+05:30 IST