రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన

ABN , First Publish Date - 2021-10-20T05:46:59+05:30 IST

రాష్ట్రంలో అరాచక రౌడీ పాలన సాగుతుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దాడులు ప్రమాదకరమన్నారు.

రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన



టీడీపీ కార్యాలయాలపై దాడికి ఖండన 

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు 


పర్చూరు, అక్టోబరు 19: రాష్ట్రంలో అరాచక రౌడీ పాలన సాగుతుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల  పార్లమెంట్‌ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దాడులు ప్రమాదకరమన్నారు.  మంగళవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, నేతల ఇళ్లపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిం చారు. ఈదాడిని ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండించాలని పిలుపు నిచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపులో భాగంగా బుధవారం జరిగే బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్‌కు మద్దత్తు ప్రకటించి రౌడీ పాలనకు చరమగీతం పాడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నే తల ఇళ్లపై దాడులకు పాల్పడటం దారుణమన్నారు. పక్కా ప్రణాళికతోనే ఇలా దాడులకు పాల్పడుతు న్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఏలూరి డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-10-20T05:46:59+05:30 IST