వైసీపీ శ్రేణుల నిరసన
ABN , First Publish Date - 2021-10-21T05:05:52+05:30 IST
ముఖ్యమంత్రి, వైసీపీ నాయకులపై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి.
ఏలూరు, అక్టోబరు 20: ముఖ్యమంత్రి, వైసీపీ నాయకులపై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిరసన ప్రదర్శనలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, దెందులూరు, అప్పనవీడు, ద్వారకాతిరుమల, బుట్టాయ గూడెం, కొవ్వూరు, చింతలపూడి, భీమవరం, వీరవాసరం, ఆచంట, కాళ్ళ, పోడూరు, ఆకివీడు, తాళ్లపూడి, సరిపల్లి, నిడదవోలు, తణుకు తదితర ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు ఆందోళన చేశారు.