టీడీపీలోకి వైసీపీ కార్యకర్తలు

ABN , First Publish Date - 2022-05-22T06:48:38+05:30 IST

మండలంలోని కితలంగి పంచాయతీ రంగిసింగ్‌గూడ గ్రామంలో వైసీపీకి చెందిన 200 కుటుంబాలు మాజీమంత్రి, టీడీపీ అరకు నియోజకవర్గం ఇన్‌చార్జి కిడారి శ్రావణ్‌కుమార్‌ సమక్షంలో టీడీపీలో చేరారు.

టీడీపీలోకి వైసీపీ కార్యకర్తలు
మాజీమంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

రంగిసింగ్‌గూడలో పార్టీ మారిన 200 కుటుంబాలు

డుంబ్రిగుడ, మే 21: మండలంలోని కితలంగి పంచాయతీ రంగిసింగ్‌గూడ గ్రామంలో వైసీపీకి చెందిన 200 కుటుంబాలు మాజీమంత్రి, టీడీపీ అరకు నియోజకవర్గం ఇన్‌చార్జి కిడారి శ్రావణ్‌కుమార్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి శాలువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు వైసీపీ పాలన పట్ల విసుగెత్తారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడుస్తున్నా గిరిజన ప్రాంతంలోని రోడ్లు,తాగునీరువంటి సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-22T06:48:38+05:30 IST