బీజేపీ ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు

ABN , First Publish Date - 2021-10-20T05:23:55+05:30 IST

బి.కోడూరు మండల పరిధిలోని మున్నెల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో బీజేపీ నాయకులు ప్రచారానికి రాగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

బీజేపీ ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
బి.కోడూరు స్టేషన్‌ ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

కేసు నమోదుకు బీజేపీ నేతల డిమాండ్‌

బి.కోడూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బీజేపీ ధర్నా


బి.కోడూరు, అక్టోబరు 19 : బి.కోడూరు మండల పరిధిలోని మున్నెల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో బీజేపీ నాయకులు ప్రచారానికి రాగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మా జగన్‌ను నిందిస్తారా.. మా పైనే పోటీ చేస్తారా అంటూ దాడికి దిగారని సమాచారం. తమ ప్రచారాన్ని అడ్డుకోవడమే కాకుండా తమపై వైసీపీ కార్యకర్తలు భాతికంగా దాడి చేశారని బి.కోడూరు మండల బీజేపీ అధ్యక్షుడు తిప్పలూరు రామ్మోహన్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లారు. స్టేషన్‌లో ఎవరూ లేకపోవడంతో స్టేషన్‌ ముందు ఓబీసీ నేషనల్‌ సెక్రటరీ డాక్టర్‌ పార్థసారధి, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కడప జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్‌చంద్ర, మరి కొంత మంది బీజేపీ కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు వారు అక్కడే బైఠాయించారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్‌, పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ నస్రిన్‌ స్టేషన్‌కు చేరుకుని వారితో మాట్లాడి ఫిర్యాదు తీసుకోవడంతో ధర్నా విరమించారు. ఈ విషయమై డీఎస్పీ విజయకుమార్‌ను వివరణ కోరగా బీజేపీ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-10-20T05:23:55+05:30 IST