‘రాజకీయంగా ఎవరో లాభపడడం కోసమే రఘురామరాజు..’
ABN , First Publish Date - 2020-09-29T21:38:15+05:30 IST
‘రాజకీయంగా ఎవరో లాభపడడం కోసమే రఘురామరాజు..’
గుంటూరు: రాజకీయంగా ఎవరో లాభపడడం కోసమే అంతర్వేదిపై రఘురామరాజు రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రులను కలుస్తుంటే టీడీపీ ఎంపీలు అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్ర మంత్రులను కలుస్తున్నారని చెప్పారు. ఉచిత విద్యుత్ మీటర్లపై రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమన్నారు.