మూడు రాజధానులపై వైసీపీ శ్రేణుల సంబరాలు

ABN , First Publish Date - 2020-08-02T11:14:52+05:30 IST

మూడు రాజధానులపై వైసీపీ శ్రేణుల సంబరాలు

మూడు రాజధానులపై వైసీపీ శ్రేణుల సంబరాలు

రైల్వేకోడూరు, ఆగస్టు, 1: మూడు రాజధానులపై వైసీపీ శ్రేణులు శనివారం రైల్వేకోడూరు పట్టణం లోని టోల్గేట్‌ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్ద సంబరాలు జరుపుకున్నారు. మొదటి గా వైఎస్‌ విగ్రహాం కు పాలాభిషేకం చేశారు. అనంతరం అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తీపి పదార్థాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నేత, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మందల నాగేంద్ర, పట్టణ అధ్యక్షుడు సీహెచ్‌ రమే్‌షబాబు, అనంతరాజుపేట ఎంపీటీసీ సభ్యులు బండారు మల్లికార్జున, ట్రేడ్‌ యూనియన్‌ కన్వీనర్‌ కొప్పల శంకరయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు మారెళ్ల రాజేశ్వరి, సీనియర్‌ నేతలు చెన్నంశెట్టి చలపతి (సీసీ), నందా బాలసుబ్రమణ్యం, రజని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-02T11:14:52+05:30 IST