హిమచల్‌లోని యోనామ్‌ పర్వతంపై యశ్వంత్‌

ABN , First Publish Date - 2022-06-27T09:29:40+05:30 IST

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం భూక్యాతండా జీపీకి చెందిన...

హిమచల్‌లోని యోనామ్‌ పర్వతంపై యశ్వంత్‌

మరిపెడ రూరల్‌(చిన్నగూడూ రు), జూన్‌ 26: మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం భూక్యాతండా జీపీకి చెందిన భూక్యా యశ్వంత్‌ హిమచల్‌ప్రదేశ్‌లోని 6,111మీటర్ల ఎత్తైన యోనామ్‌ మంచు పర్వతాన్ని అధిరోహించారు. యశ్వంత్‌ హైదరాబాద్‌లోని ఎన్‌డీసీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. చిన్నతనం నుంచి పర్వతారోహణను అలవాటుగా చేసుకున్నారు. ఆయన ప్రతిభను ట్రాన్సెండర్‌ అడ్వెంచర్‌ స్వచ్ఛంద సంస్థ గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఇప్పటికే జమ్ముకశ్మీర్‌లోని ఖార్డుంగ్‌లా, దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతరోహణను యశ్వంత్‌ పూర్తి చేశారు. ఎవరెస్ట్‌ను అధిరోహించడం ఆయన లక్ష్యంగా చెబుతున్నారు. 

Updated Date - 2022-06-27T09:29:40+05:30 IST