నెంబర్‌వన్‌కు షాక్‌

ABN , First Publish Date - 2021-04-11T08:59:40+05:30 IST

వరుస విజయాలతో జోరుమీదున్న ప్రపంచ నెంబర్‌వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి యాష్లే బార్టీకి వోల్వో కార్‌ ఓపెన్‌లో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో స్పెయిన్‌కు చెందిన పౌలా బడోసా 6-4, 6-3తో...

నెంబర్‌వన్‌కు షాక్‌

చార్లెస్టన్‌ (యూఎస్‌): వరుస విజయాలతో జోరుమీదున్న ప్రపంచ నెంబర్‌వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి యాష్లే బార్టీకి వోల్వో కార్‌ ఓపెన్‌లో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో స్పెయిన్‌కు చెందిన పౌలా బడోసా 6-4, 6-3తో ఆసీస్‌ తార బార్టీకి షాకిచ్చి సంచలనం సృష్టించింది. మ్యాచ్‌ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన 23 ఏళ్ల బడోసా.. బార్టీ సర్వీ్‌సను ఐదుసార్లు బ్రేక్‌ చేయడం గమనార్హం. గత నాలుగు ఈవెంట్లలో బడోసా సెమీస్‌ చేరడం ఇది రెండోసారి. ఫైనల్లో చోటు కోసం రష్యాకు చెందిన 15వ సీడ్‌ వెరోనికా కుదెర్‌మెతోవాతో బడోసా అమీతుమీ తేల్చుకోనుంది. 


Updated Date - 2021-04-11T08:59:40+05:30 IST