రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ బాదిన అండర్-19 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ధుల్
ABN , First Publish Date - 2022-02-17T23:13:25+05:30 IST
అద్వితీయ ఆట తీరుతో భారత్కు అండర్-19 ప్రపంచకప్ అందించిన యువ ఆటగాడు యశ్
గువాహటి: అద్వితీయ ఆట తీరుతో భారత్కు అండర్-19 ప్రపంచకప్ అందించిన యువ ఆటగాడు యశ్ ధుల్ రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్లోనూ చెలరేగాడు. ఎలైట్ గ్రూప్ హెచ్లో భాగంగా గువాహటిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్లో యశ్ సెంచరీ చేశాడు.
133 బంతుల్లో 16 బౌండరీలతో సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తమిళనాడు బౌలింగ్ ఎంచుకుంది. ధుల్ 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఎం మొహమ్మద్ బౌలింగులో అవుటయ్యాడు. అయితే, అది నో బాల్ కావడంతో బతికిపోయాడు. ఆ తర్వాత సెంచరీ పూర్తి చేసుకున్న ధుల్.. మొత్తంగా 150 బంతుల్లో 18 ఫోర్లతో 113 పరుగులు చేసి అవుటయ్యాడు.
రంజీల్లో అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ చేసిన ఆటగాడిగా ధుల్ రికార్డులకెక్కాడు. కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి తమిళనాడు ఏడు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది.