AP News: నీటిలో యోగా చేసిన యార్లగడ్డ గీత
ABN , First Publish Date - 2022-07-21T17:30:10+05:30 IST
యోగా విశేష ప్రతిభ కనబరుస్తున్న యార్లగడ్డ గీతాశ్రీకాంత్(Yarlagadda geeta srikanth) వినూత్నంగా నీటిలో యోగా(Yoga) చేశారు.
విజయవాడ: యోగాలో విశేష ప్రతిభ కనబరుస్తున్న యార్లగడ్డ గీతాశ్రీకాంత్(Yarlagadda geeta srikanth) వినూత్నంగా నీటిలో యోగా(Yoga) చేశారు. గురువారం ఉదయం నగరంలోని నోవా హోటల్ స్విమ్మింగ్ పూల్లో గీత యోగ ఆసనాలు వేశారు. సూర్య నమస్కారాలు, శవాసనం, కూర్మాసనం, ధనురాసనం, నౌక ఆసనాలు వేశారు. అనంతరం యార్లగడ్డ గీత మాట్లాడుతూ... నీటిలో ఆసనాలు వేయడం వల్ల శరీరం బరువు తగ్గుతుందన్నారు. 100 కేజీలు ఉన్న తన బరువు చాలా వరకు కంట్రోల్ అయిందని తెలిపారు. ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా బ్రీతింగ్ కంట్రోల్లో ఉంటుందని వెల్లడించారు. తనకు కోవిడ్ వచ్చిన సమయంలో యోగ ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. జిమ్ ఎక్కువ చేయడం వల్ల హార్ట్ బీట్ ఎక్కువగా పెరుగుతుందని... యోగా చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నారు. విశాఖపట్నంలో త్వరలో ఒక యోగా సెంటర్ను ప్రారంభించనున్నట్లు యార్లగడ్డ గీత పేర్కొన్నారు.