మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి యనమల పరామర్శ

ABN , First Publish Date - 2021-08-02T16:30:49+05:30 IST

మాతృవియోగంతో..

మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి యనమల పరామర్శ

రాజమహేంద్రవరం సిటీ: మాతృవియోగంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పరామర్శించారు. ఆదివారం స్థానిక తిలక్‌ రోడ్డులోని ఆదిరెడ్డి నివాసానికి చేరుకున్న యనమల రామకృష్ణుడు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. యనమల వెంట టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పట్టపగల వెంకట్రావు, అంకం గోపి, గంగిన హనుమంతురావు, మరుకుర్తి రవీయాదవ్‌, పెనుగొండ రామకృష్ణ, నొడగల సుధ, ఇన్నిమూరిదీపు, కరగాని వేణు, మొల్లి చిన్నియాదవ్‌, పట్టపగలు సత్యనారాయణ, తదితరులున్నారు. 

Updated Date - 2021-08-02T16:30:49+05:30 IST