మరోసారి వైసీపీని గెలిపిస్తే అన్నిటికీ పన్నే: యనమల
ABN , First Publish Date - 2021-03-04T08:50:45+05:30 IST
మరోసారి వైసీపీని గెలిపిస్తే అన్నిటికీ పన్నే: యనమల
అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్ ప్రభుత్వం అప్పుల కోసం ఆస్తి పన్ను పెంచింది. మరోసారి అవకాశం ఇస్తే జుట్టు పెంచుకోవాలన్నా, కొత్త చొక్కా వేసుకోవాలన్నా, రోడ్డుపై నడిచినా పన్నులేస్తారు’’ అని తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఇప్పటికే అప్పులు చేస్తే కాని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, సంక్షేమ పథకాలు, చివరకు ముసలోళ్లకు ఇచ్చే పింఛను కూడా అప్పులు చేసే ఇస్తున్నారన్నారు. టీడీపీ గెలుపొందిన పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో పన్నులు సగానికి తగ్గిస్తూ తొలి తీర్మానం చేస్తామని మేనిఫెస్టో సాక్షిగా హామీ ఇస్తున్నామన్నారు. విశాఖ ఉక్కును తన కేసుల కోసం జగన్మోహన్రెడ్డి తాకట్టు పెట్టారని యనమల విమర్శించారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే విశాఖపట్నంలో తెలుగుదేశం గెలవాలన్నారు.