కేంద్రానికి అంశాలవారీ మద్దతు

ABN , First Publish Date - 2020-05-29T08:43:31+05:30 IST

: కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా టీడీపీ అంశాల వారీ మద్దతిస్తుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో

కేంద్రానికి అంశాలవారీ మద్దతు

  • జాతీయ స్థాయిలో తొలి నుంచీ టీడీపీ కీలక పాత్ర


అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా టీడీపీ అంశాల వారీ మద్దతిస్తుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రకటించారు. పార్టీ రాజకీయ తీర్మానంపై మాట్లాడుతూ ఆయనీ విషయం తెలిపారు. ప్రాంతీయ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిందని, నేషనల్‌ ఫ్రంట్‌ ఆవిర్భావంలో టీడీపీదే కీలక పాత్ర అని గుర్తుచేశారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ జాతీయ పార్టీ స్ధాయికి ఎదిగిందని, జాతీయ స్ధాయిలో చోటు చేసుకొన్న అనేక పరిణామాల్లో తన వంతు పాత్ర పోషించిందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని... అంబేడ్కర్‌ను టీడీపీ ఆదర్శంగా తీసుకుంటే.. జగన్‌ మాత్రం రాజ్యాంగ వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు.

Updated Date - 2020-05-29T08:43:31+05:30 IST