‘రెడ్ల’ చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టి

ABN , First Publish Date - 2022-05-18T08:52:34+05:30 IST

‘‘రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా విభజించి వాటిని విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి, పెద్దిరెడ్డి వంటివారి చేతిలో జగన్‌రెడ్డి పెట్టారు.

‘రెడ్ల’ చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టి

బీసీ జపం చేస్తే సరా: యనమల

అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా విభజించి వాటిని విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి, పెద్దిరెడ్డి వంటివారి చేతిలో జగన్‌రెడ్డి పెట్టారు. నలుగురు రెడ్ల చేతిలో రాష్ట్రం పెట్టి బీసీ జపం చేస్తే సరిపోతుందా?’’ అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘టీడీపీలో బీసీలుగా నేనో... అచ్చెన్నాయుడో, అయ్యన్నపాత్రుడో మాట్లాడుతున్నాం. వైసీపీలో ఎవరు మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. ఆ నలుగురి చేతిలోనే మొత్తం ఉంది. టీడీపీ అంటేనే బీసీల పార్టీ. మేం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీని బీసీ నేతలు నడుపుతున్నారు. ఇప్పుడు వైసీపీ బీసీ నేతలని ఘనంగా చెప్పుకొంటున్న ఆర్‌.కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావు టీడీపీ నుంచే ఆ పార్టీలోకి వెళ్లారు. బీసీలకు పదవులు ఇవ్వడం మంచిదే. కాని ఏ అధికారం లేని పదవులే వైసీపీ బీసీలకు దక్కుతున్నాయి. ఢిల్లీలో లాబీయింగ్‌ కోసం నిరంజన్‌రెడ్డి వంటి వాళ్లకు పదవులు ఇచ్చారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు’’ అని వ్యాఖ్యానించారు. బీసీ వర్గాల బ్యాక్‌ బోన్‌ను విరగగొట్టిందే జగన్‌రెడ్డనీ, పార్టీలో సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేసి బీసీ నేతలను అణగదొక్కారని యనమల ఆరోపించారు. 

Updated Date - 2022-05-18T08:52:34+05:30 IST