మండలి కార్యదర్శి తీరుపై యనమల ఫైర్
ABN , First Publish Date - 2020-02-15T01:58:59+05:30 IST
మండలి కార్యదర్శి తీరుపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. సెలెక్ట్ కమిటీ దస్త్రాన్ని మండలి కార్యదర్శి మళ్లీ వెనక్కి పంపటంపై..
అమరావతి: మండలి కార్యదర్శి తీరుపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. సెలెక్ట్ కమిటీ దస్త్రాన్ని మండలి కార్యదర్శి మళ్లీ వెనక్కి పంపటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శి సభా నియమాలను ఉల్లంఘించారని తెలిపారు. సభ్యులు ఎవరైనా దీనిపై నోటీసు ఇవ్వొచ్చని చెప్పారు. క్రమశిక్షణ చర్యల కింద కఠిన నిర్ణయం తీసుకునే అధికారం చైర్మన్కు ఉందని వెల్లడించారు. పార్టీ పరంగానూ ఏం చేయాలనే దానిపై చర్చిస్తామని యనమల స్పష్టం చేశారు