బీసీలపై కక్ష సాధింపులో భాగమే కూల్చివేతలు: యనమల
ABN , First Publish Date - 2022-06-19T16:53:07+05:30 IST
Amaravathi: రాష్ట్రంలోని బీసీలను అణచివేయడమే ధ్యేయంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన మహానాడులో ప్రభుత్వ
Amaravathi: రాష్ట్రంలోని బీసీలను అణచివేయడమే ధ్యేయంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ కూల్చడం సిగ్గుచేటన్నారు. అక్రమ కట్టడమైతే.. తెల్లవారు జామున 4 గంటలకు ఆర్డీవో, ఎస్పీ సహా వందలాది మందితో రావాల్సిన అవసరం ఏమిటి.? యనమల ప్రశ్నించారు. జగన్ తుగ్లక్ ప్రభుత్వంపై పోరాడుతూనే.. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని చెప్పారు.