రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి ఆర్ధికంగా దివాళా తీయించారు: యనమల

ABN , First Publish Date - 2021-07-23T19:23:07+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి ఆర్ధికంగా దివాళా తీయించారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి ఆర్ధికంగా దివాళా తీయించారు: యనమల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి ఆర్ధికంగా దివాళా తీయించారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ లోన్స్ కంటే ఆఫ్ బడ్జెట్ లోన్స్ ఎక్కువగా తీసుకున్నారని విమర్శించారు. బడ్జెట్ అప్పులకు ఆర్టికల్ 293(3) క్రింద కేంద్రం అనుమతి తప్పనిసరి తీసుకోవాలని అన్నారు. గ్యారంటీ అవసరం లేదన్న ప్రభుత్వం ఎస్క్రో ఒప్పందం ఎందుకు చేసుకున్నట్లని ప్రశ్నించారు. పేదలకు సంక్షేమాన్ని చూపి.. వారి నెత్తిన అప్పు భారం పెంచుతారా? అంటూ నిలదీశారు. ఆదాయ మార్గాలు పెంచకుండా అప్పులతో ఎన్నాళ్లు పాలన సాగిస్తారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

Updated Date - 2021-07-23T19:23:07+05:30 IST