వైసీపీ సభలకు బలవంతంగా..యామినీశర్మ
ABN , First Publish Date - 2022-05-28T23:28:58+05:30 IST
విజయవాడ: మహిళలను బలవంతంగా వైసీపీ సభలకు తీసుకువెళ్తున్నారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి యామినీశర్మ ఆరోపించారు. రాకపోతే రూ.2,500
విజయవాడ: మహిళలను బలవంతంగా వైసీపీ సభలకు తీసుకువెళ్తున్నారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి యామినీశర్మ ఆరోపించారు. రాకపోతే రూ.2,500 జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నారని, అందుకు తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్నారు. జగన్ మూడేళ్లలో ఉద్దరించిందేమీ లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో 60 నుంచి 90 శాతం కేంద్రం నిధులు ఉండగా..అన్ని పథకాలు తనవేనని జగన్ చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓ వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ను చంపేస్తే.. మరో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయ్యాలని కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడని విమర్శించారు. ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బొడ్డు నాగలక్ష్మి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే ప్రజా ప్రతినిధులు అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ మోసాలతో జనం విసిగిపోయారని పేర్కొన్నారు.