శివకేశవులకు విశేష పూజలు

ABN , First Publish Date - 2020-10-25T11:06:05+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం హరిహరుల సన్నిధిలో దుర్గాష్టమి వేడుకలు వైభవంగా కొనసాగాయి.

శివకేశవులకు విశేష పూజలు

యాదాద్రి టౌన్‌, అక్టోబరు 24: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం హరిహరుల సన్నిధిలో దుర్గాష్టమి వేడుకలు వైభవంగా కొనసాగాయి. ప్రధానాలయంలో లక్ష్మీనరసింహులను ఆరాధించిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించి, కల్యాణ మండపంలో సుదర్శన హోమం, నిత్యతిరుకల్యాణ వేడుకలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా బాలాలయంలో లక్ష్మీ అమ్మవారిని కొలుస్తూ కుంకుమార్చనలు నిర్వహించారు.


అదేవిధంగా అనుబంధ చరమూర్తుల ఆలయంలో నిత్యపూజోత్సవాలు నిర్వహించిన పూజారులు మూలమంత్ర వేద ఇతిహాస పారాయణ పఠనం చేశారు. దుర్గా అమ్మవారిని ఆరాధిస్తూ లలితా సహస్రనామ పఠనాలతో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. కాగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఎమ్మెల్సీ నవీన్‌ దర్శించుకొని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం అర్చకులు ఆయనకు యాదాద్రీశుడి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. స్వామికి శనివారం భక్తుల నుంచి 3లక్షల 12వేల 031రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - 2020-10-25T11:06:05+05:30 IST