యాదాద్రి: హత్య కేసును ఛేదించిన పోలీసులు
ABN , First Publish Date - 2021-07-11T00:55:42+05:30 IST
జిల్లాలోని సంస్థాన్ నారాయణపురంలో జరిగిన మల్లయ్య హత్య కేసును పోలీసులు
యాదాద్రి: జిల్లాలోని సంస్థాన్ నారాయణపురంలో జరిగిన మల్లయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు మహిపాల్, నాగరాజు, వెంకటేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
మండల కేంద్రంలో దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి రైతును గురువారం హత్య చేసిన విషయం తెలిసిందే. ఎస్ఐ సుధాకర్రావు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాననారాయణపురానికి చెందిన సిలివేరు మల్లయ్య(60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారీ దినచర్యలో భాగంగా వ్యవసాయ బావి సమీపంలో పశువులు మేపేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వరం గట్టుపై కునుకు తీస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో ముఖంపై దాడిచేసి హత్య చేశారు. ఒక్కసారిగా శబ్దం రావడంతో, చుట్టుపక్కల రైతులు అక్కడికి వెళ్లి చూడగా మల్లయ్య మృతిచెంది ఉన్నాడు. విషయాన్ని సమీప రైతులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న ఏసీపీ శంకర్, చౌటుప్పల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సుధాకర్రావు సంఘటనా స్థలాన్ని సందర్శించి హత్య జరిగిన తీరును పరిశీలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్లయ్య మంత్రాలు చేస్తాడనే ప్రచారం గ్రామంలో ఉంది.