Yadadri: బాలాలయంలో నిత్యకళ్యాణం, సుదర్శన హోమం నిలిపివేత

ABN , First Publish Date - 2022-03-17T13:51:57+05:30 IST

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బాలాలయంలో నేటి నుండి నిత్య కళ్యాణం, సుదర్శన హోమం, స్వామి వారి జోడు సేవలు నిలిపివేయనున్నట్లు ఈవో గీత తెలిపారు.

Yadadri: బాలాలయంలో నిత్యకళ్యాణం, సుదర్శన హోమం నిలిపివేత

యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బాలాలయంలో నేటి నుండి నిత్య కళ్యాణం, సుదర్శన హోమం, స్వామి వారి జోడు సేవలు నిలిపివేయనున్నట్లు ఈవో గీత తెలిపారు. ఈ నెల 21 నుండి 28 వరకు మహాకుంభ సంప్రోక్షణ, పంచకుండాత్మక యాగం నిర్వహణ కారణంగా ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. భక్తులు ఆర్జిత సేవలు పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ అనంతరం ప్రధానాలయంలో భక్తుల దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు ఈవో గీత పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-17T13:51:57+05:30 IST