yadadriలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-11-21T15:59:22+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్ లో వేచివున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే స్వామివారిని

yadadriలో పెరిగిన భక్తుల రద్దీ

యాదాద్రి-భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్ లో వేచివున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆలయ పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

Updated Date - 2021-11-21T15:59:22+05:30 IST