చౌటుప్పల్లో జనశక్తి నేత ఆనంద్ అరెస్ట్
ABN , First Publish Date - 2022-03-22T16:57:38+05:30 IST
చౌటుప్పల్లో జనశక్తి నేత ఆనంద్(బొమ్మని నరసింహ)ను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
యాదాద్రి: చౌటుప్పల్లో జనశక్తి నేత ఆనంద్(బొమ్మని నరసింహ)ను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వనాథ్ పేరుతో బొమ్మని నరసింహ మీటింగ్ నిర్వహించినట్లు పోలీసులు నిర్ధారించారు. సిరిసిల్ల సరిహద్దులో జనశక్తి సమావేశం నిర్వహించినట్టు గుర్తించారు. విశ్వనాథ్తో సంబంధం లేదని జనశక్తి సెంట్రల్ కమిటీ ప్రకటన చేసింది. కాగా... నరసింహ అరెస్ట్పై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. నరసింహకు హాని తలపెట్టొద్దని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నరసింహను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.