యాదాద్రిలో దారుణం

ABN , First Publish Date - 2022-03-19T18:47:28+05:30 IST

జిల్లాలోని వలిగొండ మండలం వెల్వర్తిలో దారుణం జరిగింది.

యాదాద్రిలో దారుణం

యాదాద్రి: జిల్లాలోని వలిగొండ మండలం వెల్వర్తిలో దారుణం జరిగింది. టీఆర్ఎస్ నాయకుడు వార్డు మెంబర్ భీమగాని వెంకటేష్, అతని భార్య కలిసి అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాప్‌లో మద్యం తాగేందుకు వెళ్లిన ప్రసాద్ అనే యువకుడిపై దొంగతనం నెపంతో అతి దారుణంగా దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో  గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. మృతి విషయం తెలియగానే టీఆర్ఎస్ నాయకుడు పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిన్న ప్రసాద్ స్వగ్రామమైన వెల్వర్తిలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2022-03-19T18:47:28+05:30 IST