Yadadri: రామలింగేశ్వర స్వామి శివాలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు
ABN , First Publish Date - 2022-04-20T13:30:00+05:30 IST
యాదాద్రి శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో నేటి నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలు జరుగనున్నాయి.
యాదాద్రి : యాదాద్రి శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో నేటి నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలను అర్చకులు వైభవంగా నిర్వహించనున్నారు. ఈరోజు నుంచి 25 వరకు మహోత్సవాలు జరుగనున్నాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి అనుబంధ ఆలయంగా పర్వత వర్థిని సమేత రామలింగేశ్వర స్వామి శివాలయం పేరుగాంచింది. నేడు మహారుద్రయాగం, స్పటికలింగ ప్రతిష్ఠామహోత్సవ అంకురార్పణం జరుగనుంది. 25న సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించనున్నారు. శివాలయం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారు.