Yadadriలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2022-06-09T19:29:50+05:30 IST

జిల్లాలోని భువనగిరి మండలం హనుమపూర్ బాచ్పన్ స్కూల్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

Yadadriలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

యాదాద్రి: జిల్లాలోని భువనగిరి మండలం హనుమపూర్ బాచ్పన్ స్కూల్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. స్కూటీని డీసీఎం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతులు వలిగొండ మండలం టేకులసోమారంకు చెందిన భార్యాభర్తలు దండెబోయిన నర్సింహ, రాజ్యలక్ష్మి, నర్సింహ వదిన జంగమ్మగా గుర్తించారు. వీరు బొమ్మలరామారం మండలం చౌదరిపల్లిలో ఓ చావుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-06-09T19:29:50+05:30 IST