Yadadri: యాదాద్రిలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2022-07-31T17:48:51+05:30 IST

శ్రావణమాసం (Sravanamasam) పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.

Yadadri: యాదాద్రిలో భక్తుల సందడి

యాదాద్రి (Yadadri): శ్రావణమాసం (Sravanamasam) పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి (Shri Lakshminarasimhaswamy) ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో తెల్లవారు జామునుంచి ఆలయంలో భక్తులు బారులు తీరారు. శ్రావణ మహాలక్ష్మి కోటికుంకుమార్చన పూజలలో పాల్గొన్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి ఒక గంట సమయం పడుతోంది. భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు.


కాగా శ్రావణమాసం రెండోరోజు శనివారం (నిన్న) లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం వెలుపలి ప్రాకారం ఈశాన్య మండపంలో మహాలక్ష్మి అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి కుంకుమార్చన పూజలను వేద పండితులు నిర్వహించారు. అర్చనలో పాల్గొన్న భక్తులకు వారి గోత్రనామాల పేరిట సంకల్పం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు.

Updated Date - 2022-07-31T17:48:51+05:30 IST