యాదాద్రి: అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో లాకప్‌డెత్

ABN , First Publish Date - 2021-06-19T04:38:19+05:30 IST

జిల్లాలోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో లాకప్‌డెత్ జరిగింది. లాకప్‌డెత్‌లో చనిపోయిన వ్యక్తిని మరియమ్మ

యాదాద్రి: అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో లాకప్‌డెత్

యాదాద్రి: జిల్లాలోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో లాకప్‌డెత్ జరిగింది. లాకప్‌డెత్‌లో చనిపోయిన వ్యక్తిని మరియమ్మ(45) అనే మహిళగా గుర్తించారు.  ఇటీవల అడ్డగూడూరు మండలంలోని గోవిందాపురంలో ఫాదర్ బాలశౌరి ఇంట్లో 2 లక్షలు చోరీ జరిగాయి. పనిమనిషి మరియమ్మపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తున్న క్రమంలో మరియమ్మ మృతి చెందినట్టుగా సమాచారం. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం భువనగిరి ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 

Updated Date - 2021-06-19T04:38:19+05:30 IST