యాదాద్రి-భువనగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించడంలేదు.