యాదాద్రి క్షేత్రంలో శాస్త్రోక్తంగా లక్ష పుష్పార్చన

ABN , First Publish Date - 2022-01-29T00:35:10+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం ఏకాదశి పర్వాలు వైభవంగా కొనసాగాయి. ఏకాదశి వేడుకల్లో బాగంగా

యాదాద్రి క్షేత్రంలో శాస్త్రోక్తంగా లక్ష పుష్పార్చన

యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం ఏకాదశి పర్వాలు వైభవంగా కొనసాగాయి. ఏకాదశి వేడుకల్లో బాగంగా లక్షపుష్పార్చన పూజలను సంప్రదాయరీతిలో నిర్వహంచారు. బాలాలయంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అర్చకులు, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు. ప్రతీ ఏకాదశి పర్వదినం రోజున స్వామిని వివిధ రకాల పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం. సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజలను అర్చకబృందం, వేదపండితులు నిర్వహించగా ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T00:35:10+05:30 IST