నేడు యాదాద్రి క్షేత్రానికి సీఎం KCR

ABN , First Publish Date - 2021-10-19T13:33:39+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రి క్షేత్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్ఘాటన , మహా సుదర్శన యాగం నిర్వహణ తేదీ వివరాలను సీఎం ప్రకటించనున్నారు.

నేడు యాదాద్రి క్షేత్రానికి సీఎం KCR

యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రి క్షేత్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా  ఆలయ ఉద్ఘాటన , మహా సుదర్శన యాగం నిర్వహణ  తేదీ వివరాలను సీఎం ప్రకటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి  యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరుకోనున్నారు. ఆలయ  పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నింటిని మరోసారి పరిశీలిస్తారు. యాదాద్రి పున:ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామివారు నిర్ణయించారు. యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించనున్నారు. పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా ఈరోజు ముఖ్యమంత్రి ప్రకటిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి  చేశారు. రాచకొండ కమిషనరేట్ పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేశారు. 

Updated Date - 2021-10-19T13:33:39+05:30 IST