యాదాద్రి-భువనగిరి జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2021-11-06T22:25:50+05:30 IST

యాదాద్రి-భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం శివారెడ్డి గూడెంలో దారుణం జరిగింది. చిలక యాదయ్య

యాదాద్రి-భువనగిరి జిల్లాలో దారుణం

యాదాద్రి: యాదాద్రి-భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం శివారెడ్డి గూడెంలో దారుణం జరిగింది. చిలక యాదయ్య అనే రైతును నోముల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి కొట్టి చంపాడు. పొలంలో ఎడ్లు పడ్డాయని యాదయ్య అనడంతో కోపంతో చితకబాది రవీందర్ రెడ్డి  హత్య చేశాడని చెబుతున్నారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చౌటుప్పల్ ఏరియా ఆస్పత్రిలో యాదయ్య మృతదేహం ఉంది. ఉదయం నుండి పోలీసులు పంచనామా చేయకపోడంతో వైద్యులు పోస్టుమార్టం చేయలేదు. పోలీసులు వస్తేనే పోస్టుమార్టం నిర్వహిస్తామన్నచౌటుప్పల్ ఏరియా ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2021-11-06T22:25:50+05:30 IST