యాదాద్రిలో బాలిక కిడ్నాప్... చేధించిన పోలీసులు
ABN , First Publish Date - 2020-10-20T14:32:39+05:30 IST
జిల్లాలోని భువనగిరి పట్టణంలో మూడేళ్ళ బాలిక కిడ్నాప్ను పోలీసులు చేధించారు. తల్లికి కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి బాలికను దుండగులు అపహరించుకుపోయారు.
యాదాద్రి-భువనగిరి: జిల్లాలోని భువనగిరి పట్టణంలో మూడేళ్ళ బాలిక కిడ్నాప్ను పోలీసులు చేధించారు. తల్లికి కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి బాలికను దుండగులు అపహరించుకుపోయారు. మహబూబ్ నగర్ జిల్లా దక్కూరు మండలం గార్లపాడుకు చెందిన ఉప్పుతాళ్ల రాజు జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. నాలుగు రోజులైనా తిరిగి రాకపోవడంతో వెతుక్కుంటూ మూడేళ్ళ కూతురిని వెంటబెట్టుకుని భార్య మహేశ్వరి హైదరాబాద్ వెళ్లింది. మహిళను గమనించిన కిడ్నాప్ ముఠా.. హైదరాబాద్ ఎంజీబీఎస్లోనే భర్త దగ్గరకు తీసుకెళ్తామని మాయ మాటలు చెప్పి భువనగిరికి తీసుకువచ్చారు. ఆపై బాలికను కిడ్నాప్ చేశారు. ఆ తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టి కిడ్నాపర్ల చెర నుంచి బాలికను రక్షించారు. తల్లి మహేశ్వరికి బాలికను అప్పగించారు. కిడ్నాప్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.