Yadadri: కమ్మగూడెంలో బీజేపీ నేతల రాస్తారోకో
ABN , First Publish Date - 2021-09-01T19:05:57+05:30 IST
జిల్లాలోని వలిగొండ మండలం కమ్మగూడెం వద్ద వర్షానికి దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
యాదాద్రి-భువనగరి: జిల్లాలోని వలిగొండ మండలం కమ్మగూడెం వద్ద వర్షానికి దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భువనగిరి-చిట్యాల రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. కాగా వారిని వలిగొండ పోలీస్ స్టేషన్కి తరలిస్తుండగా పోలీస్ వాహనం అదుపుతప్పి రోడ్డు వెంబడి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.