ధర్మ ప్రచార పరిషత్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-01-21T03:10:33+05:30 IST

: టీడీపీ ఆధ్వర్యంలో తిరుపతి నుంచి ప్రారంభించనున్న ధర్మ ప్రచార పరిషత్‌ కార్యక్రమాన్ని

ధర్మ ప్రచార పరిషత్‌ కార్యక్రమాన్ని   విజయవంతం చేయండి
మాట్లాడుతున్న రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్‌


వెంకటగిరి, జనవరి 20: టీడీపీ ఆధ్వర్యంలో తిరుపతి నుంచి ప్రారంభించనున్న ధర్మ ప్రచార పరిషత్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రేపల్లె ఎమ్మెల్యే, తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికల వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకుడు అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.బుధవారం  మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నివాసంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  ఆయన పాల్గొని మాట్లాడారు.  అన్ని మతాలను గౌరవించే పార్టీ ఒక్క టీడీపీ మాత్రమే నన్నారు. తిరుమల్లో జరుగుతున్న అన్యమత ప్రచారాన్ని అడ్డు కునేందుకు టీడీపీ తిరుపతి నుంచి ధర్మ ప్రచార పరిషత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశమిస్తే దోచుకొన్న ప్రజాధనాన్ని దాచుకోవడం తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని ఆరోపించారు. తిరుపతి  ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం తథ్యమని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, నియోజకవర్గ పరిధిలోని ఆరు  మండలాల నాయకులు పాల్గొన్నారు.

------------


Updated Date - 2021-01-21T03:10:33+05:30 IST