డబ్ల్యూటీసీ ఫైనల్: ఎట్టకేలకు ప్రారంభమైన మ్యాచ్

ABN , First Publish Date - 2021-06-22T21:57:43+05:30 IST

తొలి రోజు నుంచే ఆటంకాలు ఎదుర్కొంటున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ప్రతి రోజూ అడ్డుతగులుతూనే

డబ్ల్యూటీసీ ఫైనల్: ఎట్టకేలకు ప్రారంభమైన మ్యాచ్

సౌతాంప్టన్: తొలి రోజు నుంచే ఆటంకాలు ఎదుర్కొంటున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ప్రతి రోజూ అడ్డుతగులుతూనే ఉన్నాడు. తొలి రోజు మ్యాచ్ పూర్తిగా రద్దు కాగా రెండు, మూడో రోజు ఆట కొనసాగింది. తిరిగి నాలుగో రోజైన నిన్నటి ఆటను వర్షం పూర్తిగా అడ్డుకుంది. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు అయింది. నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉండడంతో నేటి ఆటపైనా అనుమానాలు మొదలయ్యాయి.


అయితే, ఈ ఉదయం వరుణుడు కొంత తెరిపినివ్వడం, వాతావరణం మ్యాచ్‌కు అనుకూలంగా మారడంతో కివీస్ తన తొలి ఇన్సింగ్స్‌ను ప్రారంభించింది. అయితే, అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడం, పిచ్‌పై తేమ ఉండడంతో బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది.  అదే జరిగితే కివీస్ బ్యాట్స్‌కు తిప్పలు తప్పనట్టే. న్యూజిలాండ్ ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ 12, రాస్ టేలర్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-06-22T21:57:43+05:30 IST