డీఆర్ఎస్ ఉండుంటే పాక్‌పై 10 వికెట్లు ముందే పూర్తయ్యేవి: కుంబ్లే

ABN , First Publish Date - 2020-08-01T22:22:21+05:30 IST

లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ప్రస్తుత క్రికెట్‌లోని డీఆర్‌ఎస్ విధానంపై మాట్లాడాడు. అప్పట్లో ఈ రివ్యూ సిస్టం ఉంటే తన పది వికెట్ల రికార్డు..

డీఆర్ఎస్ ఉండుంటే పాక్‌పై 10 వికెట్లు ముందే పూర్తయ్యేవి: కుంబ్లే

న్యూఢిల్లీ: లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ప్రస్తుత క్రికెట్‌లోని డీఆర్‌ఎస్ విధానంపై మాట్లాడాడు. అప్పట్లో ఈ రివ్యూ సిస్టం ఉంటే తన పది వికెట్ల రికార్డు ఇంకా వేగంగా పూర్తయ్యేదని అన్నాడు. 1999లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కుంబ్లే 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ టీ బ్రేక్‌లో మునుపటికన్నా ఎక్కువ వికెట్లు తేయొచ్చని అర్థం అయిందని, కాని 10 వికెట్లూ తీస్తానని కలలో కూడా ఉహించలేదని కుంబ్లే గుర్తుచేసుకున్నాడు. ‘ అప్పుడు గనుక డీఆర్ఎస్ అమలులో ఉంటే ఆ 10 వికెట్లు ముందుగానే పూర్తయ్యేవి. అదిలేదు కాబట్టే కొంచెం ఆలస్యం అయ్యింది’అని కుంబ్లే పేర్కొన్నాడు. భారత బౌలర్లలో ఒకే మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన ఘనత కుంబ్లే సొంతం చేసుకున్నాడు.

Updated Date - 2020-08-01T22:22:21+05:30 IST