జంగారెడ్డిగూడెంలో ఎక్కడి చెత్త అక్కడే..

ABN , First Publish Date - 2021-04-16T06:24:14+05:30 IST

జంగారెడ్డిగూడెం పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు.

జంగారెడ్డిగూడెంలో ఎక్కడి చెత్త అక్కడే..
మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కౌన్సిలర్లు

మున్సిపల్‌ కౌన్సిలర్ల మండిపాటు



జంగారెడ్డిగూడెం, ఏప్రిల్‌ 15 : జంగారెడ్డిగూడెం పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. పురపాలక సంఘ సమా వేశం చైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. కౌన్సిలర్లు ముప్పిడి అంజి, మేడవరపు లక్ష్మీజ్యోతి, కరుటూరి రమాదేవి, ము ప్పాని రమణ, వలవల తాతాజీ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడి చెత్త అక్క డే ఉంటుందన్నారు. చెత్తకుప్పలను తరలించడంలో తీవ్ర జాప్యం నెలకొం టుందని మండిపడ్డారు. 29వ వార్డు లోకేశ్‌ నగర్‌లో తాగునీటికోసం ఇబ్బం దులు పడుతున్నారని, ప్రత్యేక బోరు బావి ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్‌ సాధారణ నిధుల వినియోగం పారదర్శకంగా ఉండాలన్నారు. ముప్పిడి అంజి మాట్లాడుతూ పట్టణ ప్రణాళికా విభాగం సేవలు పారదర్శ కంగా లేవన్నారు. నిర్మాణాలకు అనుమతిలో ఇంజనీర్లు జాప్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయన్నారు. రోడ్డు నిర్మాణాల్లో జాప్యం జరుగుతుంద న్నారు. సమావేశంలో ప్రవేశపెట్టిన ఆరు అంశాలపై చర్చించి ఆమోదం తెలి పారు. కమిషనర్‌ జి.శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ సభ్యులు తెలియజేసిన సమస్యలపై దృష్టి సారించి పరిష్కరి స్తామన్నారు. ఏఈ పి.సాయి, సంధ్య, ఆర్‌ఐ సాకేత్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రమణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T06:24:14+05:30 IST