ఘనంగా దుర్గామాత పూజలు
ABN , First Publish Date - 2022-10-02T03:49:22+05:30 IST
విశ్వనాథ ఆలయ కాలక్షేప మండ పంలో శనివారం సర్వజనని దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గా మాతను ప్రతిష్టించారు. ఎమ్మెల్యే సతీమణి పాల్గొని పూజలు నిర్వహించారు. చిన్నారులు దుర్గామాత వేషధారణలో అలరించారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 1: విశ్వనాథ ఆలయ కాలక్షేప మండ పంలో శనివారం సర్వజనని దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గా మాతను ప్రతిష్టించారు. ఎమ్మెల్యే సతీమణి పాల్గొని పూజలు నిర్వహించారు. చిన్నారులు దుర్గామాత వేషధారణలో అలరించారు. మున్సిపల్ చైర్మన్ పెం ట రాజయ్య, ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీపతి శ్రీనివాస్, యువ నాయ కుడు విజిత్రావు, డైరెక్టర్ రీనారాణీదాస్, ధర్మేందర్, సరోజ, పాల్గొన్నారు.
బెల్లంపల్లి: పట్టణంలోని 21, 22 వార్డుల్లో ప్రతిష్టించిన దుర్గాదేవిని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దర్శించుకున్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ అధికా ర ప్రతినిధి లక్ష్మణ్, టీఆర్ఎస్వై పట్టణాధ్యక్షుడు సన్నిబాబు పాల్గొన్నారు.
చెన్నూరు: పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో ప్రతిష్టించిన దుర్గామాతను రూ. 33,33,333లతో అలంకరించారు.
కాసిపేట: వర్తక సంఘం ఆధ్వర్యంలో దుర్గామాతను రూ.1,11,111లతో అమ్మవారిని అలంకరించి పూజలు చేశారు.