నృసింహుని సన్నిధిలో ప్రముఖుల పూజలు
ABN , First Publish Date - 2021-10-18T06:25:00+05:30 IST
ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వా మిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ విద్యాధర్ భట్ కు టుంబ సభ్యులు ఆదివారం సందర్శించారు.
ధర్మపురి, అక్టోబరు 17: ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వా మిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ విద్యాధర్ భట్ కు టుంబ సభ్యులు ఆదివారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వారికి వేదపం డితులు, అర్చకులు, సిబ్బంది మర్యాద పూ ర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి సన్నిధిలో వారు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ తదితర వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య వారిని ఘనంగా ఆ శీర్వదించారు. ఆలయ సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ వారికి స్వామి శేష వస్త్రం, చిత్రపటం, ప్రసాదాలు బహుకరించి సత్క రించారు. వారి వెంట ఆలయ ముఖ్య అర్చకులు నంబి నరసింహమూర్తి, అభిషేక్ పౌరోహితులు సంతోష్కుమార్, సంపత్కుమార్ పాల్గొన్నారు.
నృసింహుని సన్నిధిలో సత్యార్థ శ్రీపాద గళవర్ పూజలు
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని బెంగుళూర్ (మద్వ పీఠం) ఉత్తరాధి పీఠాఽధిపతి సత్యార్థ తీర్థ శ్రీపాద గళవర్ ఆదివారం ఉద యం సందర్శించారు. పీఠాధిపతికి వేదపండితులు, అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి సన్నిధిలో వారు ప్ర త్యేక పూజలు జరిపారు. సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, ము ఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, అర్చకులు స్వామి వారి శేషవస్త్రం, పండ్లు, ఫలాలు అందించారు. వారి వెంట ఆలయ ముఖ్య అర్చకులు నం బి నరసింహమూర్తి, అభిషేక్ పౌరోహితులు బొజ్జ సంతోష్ కుమార్, సం పత్కుమార్, గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్న సత్ర సంఘం అధ్యక్షులు మద్వాచారి రాంకిషన్ పాల్గొన్నారు.