కాల భైరవస్వామి ఆలయంలో పూజలు
ABN , First Publish Date - 2021-10-20T04:39:24+05:30 IST
ఇసన్నపల్లి-రామారెడ్డి కాలభైరవస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సదాశివనగర్, అక్టోబరు 19: ఇసన్నపల్లి-రామారెడ్డి కాలభైరవస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి మంగళ స్నానాలు నిర్వహించి సింధూరంతో అల ంకరించారు. మధ్యాహ్నం 12 గంటలకు హారతి కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదా లు అందజేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్న దానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యవర్గం ఈవో రవీందర్, సూపర్వైజర్ సురేందర్లు పాల్గొన్నారు.