దేశభక్తి గీతాలు ఆలపించి ప్రపంచ రికార్డు

ABN , First Publish Date - 2022-08-13T08:55:08+05:30 IST

రాజస్థాన్‌లోని పాఠశాల విద్యార్థులు ప్రపంచ రికార్డు సృష్టించారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా దాదాపు కోటి మంది పాఠశాల విద్యార్థులు శుక్రవారం దేశభక్తి

దేశభక్తి గీతాలు ఆలపించి ప్రపంచ రికార్డు

రాజస్థాన్‌లో కోటి మంది విద్యార్థుల ఘనత


జైపూర్‌, ఆగస్టు 12: రాజస్థాన్‌లోని పాఠశాల విద్యార్థులు ప్రపంచ రికార్డు సృష్టించారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా దాదాపు కోటి మంది పాఠశాల విద్యార్థులు శుక్రవారం దేశభక్తి గీతాలను ఆలపించి ఈ రికార్డును నెలకొల్పారు. ఇందులో భాగంగా ‘వందే మాతరం’, ‘సారే జహాసే అచ్చా’, జాతీయ గీతం ‘జనగణమన’ వంటి గీతాలను దాదాపు 25 నిమిషాలపాటు ఆలపించారు. ఈ సందర్భంగా సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులను అభినందించారు. 

Updated Date - 2022-08-13T08:55:08+05:30 IST