ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
ABN , First Publish Date - 2022-08-20T04:59:43+05:30 IST
జమ్మలమడుగు పట్టణంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. శుక్రవారం ఉదయం పట్టణంలో ఫొటో, వీడియోగ్రాఫర్స్ యజమానులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
జమ్మలమడుగు రూరల్, ఆగస్టు 19: జమ్మలమడుగు పట్టణంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. శుక్రవారం ఉదయం పట్టణంలో ఫొటో, వీడియోగ్రాఫర్స్ యజమానులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సంజాముల మోటు వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండు, అక్కడి నుంచి పాత బస్టాండు గాంధీ విగ్రహం వద్ద ఫొటోగ్రాఫర్లు గాంధీ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి గౌషియా షాదీఖానా చేరుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాన్ని డాక్టర్ రామయ్య ప్రారంభించారు. ఫొటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు గురునాథ్, వైస్ప్రెసిడెంట్ సుధాకర్, వాణీప్రసాద్, సెక్రటరీ సుబ్బు, జాయింట్ సెక్రటరీ రాజేష్, రామనాథ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.